రామ్ చరణ్ ని టార్గట్ చేసిన డిస్ట్రిబ్యూటర్
దీంతో ‘ధృవ’ చిత్ర యూనిట్ హడలిపోతుంది. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ‘ధృవ’ చిత్రం పై పలువురు డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్ ని క్లోజ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ‘ధృవ’ మూవీ రీలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకొని... దీపావళికి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. దీని కారణంగా బిజినెస్ ని క్లోజ్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హడలిపోతున్నారు. ఫైనాన్షియర్స్ వద్ద ఇప్పటికే అప్పులు తెచ్చుకొని మరీ ‘ధృవ’ రైట్స్ ని తీసుకున్నడిస్ట్రిబ్యూటర్స్...సినిమా రిలీజ్ వాయిద పడిందంటే ఆ ఎఫెక్ట్ ఎక్కువుగా ఉంటుంది.
అయితే ఈ తరహా ప్రచారంని ఎవరో కావాలని చేస్తున్నారని చిత్ర యూనిట్ నుండి వినిస్తుంది. ఇక చిత్రయూనిట్ ఈ గాసిప్స్ ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనే కోణంలో పరిశీలిస్తే...ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పేరు బయటకు వచ్చింది. నైజాం ఏరియాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ తనకు రాలేదని... ‘ధృవ’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటూ వార్తలను బయటకు చెబుతున్నాడంట. దీంతో మీడియా సైతం ఆ న్యూస్ ని ఫాలో అయిందని తెలిసింది.
మొత్తంగా ఈ గాసిప్స్ కి చెక్ పెట్టాలని ఉద్ధేశంతో ధృవ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసిన సంగంతి తెలిసిందే. ‘ధృవ’ సినిమా దసరా సీజన్కు రావట్లేదంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధం అంటూ..ఇది 7న ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీమ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో ‘ధృవ’ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చేసుకోనుంది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్నారు.