మహేష్ అఖిల్ మ్యూజికల్ చైర్స్ లో విన్ అయిన సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja
‘ఊపిరి’ హిట్ అయిన తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి విషయంలో వచ్చినన్ని ట్విస్టులు ఈమధ్య కాలంలో ఏ దర్శకుడు విషయంలోను రాలేదు. ‘ఊపిరి’ సినిమాలో వంశీ పైడిపల్లి ప్రదర్శించిన ప్రతిభకు ఫిదా అయిన నాగార్జున తన కొడుకు అఖిల్ ను వంశీ పైడిపల్లి చేతిలో పెట్టి టాప్ యంగ్ హీరోగా మారుద్దామని ప్రయత్నాలు చేసాడు. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి నాగార్జున తో వంశీ పైడిపల్లి స్టోరీ లైన్ కూడ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ కథ సెట్స్ పైకి వెళుతుంది అని అనుకుంటున్న సమయంలో ఈసినిమా బడ్జెట్ పరంగా తేడాలు రావడంతో వంశీ పైడిపల్లి బ్యాక్ అవుట్ అయిపోయిన విషయం తెలిసిందే.

ఇది జరగడానికి ముందు వంశీ పైడిపల్లికి మహేష్ దగ్గర నుండి పిలుపు వచ్చింది అన్న రూమర్స్ కూడ ఉన్నాయి. అయితే మహేష్ ఈ దర్శకుడు చెప్పిన కథ అంతా విని మురగ దాస్ సినిమా పూర్తి అయిన తరువాత ఆలోచిద్దాం అని అనడంతో ఈ దర్శకుడు అటు అఖిల్ ఇటు మహేష్ ను పోగొట్టుకున్న దర్శకుడుగా మారిపోయాడు అంటూ అతడి పై సెటైర్లు కూడ పడ్డాయి. 

ఎవరూ ఊహించని విధంగా వంశీ పైడిపల్లి చూపు మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ వైపు పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఈ వార్తలు ఇలా రావడానికి ఒక కారణం ఉంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘తిక్క’ టీజర్ లాంచ్ కు దర్శకుడు వంశీ అతిధిగా రావడమే కాకుండా సాయి ధరమ్ తేజ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ విపరీతంగా ప్రశంసలు కురిపించడంతో ఈ టాప్ డైరెక్టర్ చూపులు ఈ మెగా యంగ్ హీరో పై పడ్డాయా అంటూ ఆ టీజర్ లాంచింగ్ ఫంక్షన్ కు వచ్చిన కొందరు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ను హీరోగా సినిమాను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో వంశీ ఇలా ‘తిక్క’ టీజర్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చి సాయి ధరమ్ ను పొగడ్తలతో ముంచి వేసాడు అనే గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి. అయితే బడ్జెట్ సరిపోలేదని ఏకంగా అఖిల్ సినిమానే వదులుకున్న ఈ కాస్ట్లీ డైరెక్టర్ కు మధ్య తరహా బడ్జెట్ సినిమాలను చేసే సాయి ధరమ్ తేజ్ వైపు ఎలా దృష్టి పెట్టాడు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: