బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ధనుష్ , అసురన్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటన హైలైట్ గా నిలిచింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించాడు. ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వడ చెన్నై కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక ధనుష్ ప్రస్తుతం , దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈఏడాది డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.