యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. డ్రాగన్ మూవీ అలా ఉండబోతుందా?

Reddy P Rajasekhar

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. 'ఆర్ఆర్ఆర్' వంటి అంతర్జాతీయ విజయం తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ అమాంతం పెరగడం, మరోవైపు 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా ఎదగడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే ప్రకటన వచ్చినప్పటి నుండి అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే బొగ్గు గనులు, నలుపు రంగు షేడ్స్, డార్క్ థీమ్ సెట్టింగ్స్ గుర్తుకు వస్తాయి. ఆయన మేకింగ్ స్టైల్ అంతా ఒక రకమైన 'డార్క్ వరల్డ్' చుట్టూ తిరుగుతుంటుంది. అయితే, 'డ్రాగన్' విషయంలో నీల్ తన పంథాను పూర్తిగా మార్చుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం తన శైలిని మార్చుకోవడం ఒక పెద్ద కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమా ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు భిన్నంగా చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని, విజువల్స్ పరంగా కొత్త అనుభూతిని ఇస్తుందని సమాచారం. తన సిగ్నేచర్ స్టైల్ అయిన డార్క్ షేడ్స్ ను పక్కన పెట్టి, ఎన్టీఆర్ కోసం ఒక వైవిధ్యమైన కలర్ ప్యాలెట్ ను ఆయన ఎంచుకోవడం విశేషం. ఈ మార్పు కేవలం విజువల్స్ కే పరిమితం కాకుండా, కథాంశంలో కూడా కొత్తదనాన్ని చూపిస్తుందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు ఏమాత్రం వెనకాడకుండా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తుండగా, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లకు తోడు ఈ కొత్త కలర్ ఫుల్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: