పద్మ అవార్డ్స్ 2026: మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తో పాటు పద్మ అవార్డ్స్ అందుకున్న సెలబ్రిటీస్ వీళ్ళే..?

Divya
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 కి సంబంధించి పద్మ పురస్కారాలను సైతం ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 5 గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులు వరించగా ,అలా మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. అయితే ఇందులో తెలుగు వారికి 11 మందికి పద్మ అవార్డులు వరించాయి.


గత ఏడాది నవంబర్ నెలలో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించగా , నటుడు మరణాంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.

మలయాళం లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన మమ్ముట్టికి ఇప్పటికి తన సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు  ప్రకటించారు.

బాలీవుడ్లో సీనియర్ సింగర్ గా  పేరు సంపాదించిన ఆల్కా మాగ్నిక్ కు పద్మభూష అవార్డు ప్రకటించారు.

టాలీవుడ్ విషయానికి వస్తే సీనియర్ హీరో గా, నిర్మాతగా పేరు సంపాదించిన  మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

అలనాటి హీరో రాజేంద్రప్రసాద్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు . రాజేంద్రప్రసాద్  పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

తెలుగు ,తమిళ్ ,బాలీవుడ్ చిత్రాలలో నటించి ఒకప్పుడు హీరోగా భారీ క్రేజీ సంపాదించిన మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అరవిందు వైద్యకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ నటుడు అనిల్ రాస్తోగికి , అలాగే బెంగాల్ నటుడు నిర్మాతగా పేరు పొందిన ప్రోసేన్ జిత్ పద్మశ్రీ అవార్డు వరించింది.

బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల కు మరణాంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

అలా 131 మందికి ఈ పద్మ అవార్డ్స్ లభించాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో లిస్ట్ కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: