సరిగ్గా ‘పుష్ప 2’ కు ఒక సంవత్సరం పూర్తి.. సంచలనం సృష్టిస్తున్న బన్నీ షేర్ చేసిన పిక్..!
అంతటి హైప్, హంగామా తర్వాత వచ్చిన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ మరింత స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టింది. అంచనాలకు అందని రీతిలో భారీ వసూళ్లు రాబట్టడం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఆల్టైమ్ హైయస్ట్ గ్రాసింగ్ మూవీలో ఒకటిగా నిలిచి, దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. ఈ చిత్రం విడుదలై సరిగ్గా నేడు డిసెంబర్ 5తో ఒక సంవత్సరం పూర్తిచేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో దర్శకుడు సుకుమార్తో కలిసి పుష్ప 2 క్లైమాక్స్ సీన్పై డిస్కషన్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోతో పాటు ఆయన రాసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్గా మారింది.
బన్నీ తన పోస్ట్లో, పుష్ప ప్రపంచం కోసం తాను గడిపిన ఐదేళ్ల కఠినమైన ప్రయాణం, తనను పూర్తిగా మార్చేసిన సవాళ్లు, పాత్ర కోసం చేసిన కృషి, రాత్రింబవళ్ళు పనిచేసిన యూనిట్ సభ్యుల నిబద్ధత—అన్నీ గుర్తు చేసుకున్నారు. పుష్ప 2 వంటి చరిత్రాత్మక విజయాన్ని అందించిన తన టీమ్కి, దర్శకుడు సుకుమార్కి, అలాగే ప్రతి ప్రేక్షకుడికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రత్యేకంగా, “ఇంత ప్రేమ, ఇంత ఆదరణ, ఇంత పెద్ద విజయం ఇవ్వడం — ఇవన్నీ నాకు జీవితాంతం గుర్తుండే కానుకలు. మా ప్రయాణానికి తోడు నిలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు” అని పేర్కొంటూ, పుష్ప 2 విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక బన్నీ షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అభిమానులు, సినీ ప్రముఖులు, అనేక మంది నెటిజన్లు కామెంట్స్తో నింపేస్తూ, పుష్ప 3 కోసం భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజీపై దేశవ్యాప్తంగా ఉన్న పిచ్చి, బన్నీకి ఉన్న అనూహ్య క్రేజ్ని ఈ ఒక్క పోస్ట్ మళ్లీ నిరూపించింది. మొత్తానికి, ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యి సంవత్సరం పూర్తయినా, ఆ హంగామా మాత్రం ఇప్పటికీ తగ్గేలా లేదు. ఇక బన్నీ పోస్ట్తో ఈ రోజు అభిమానులకు మరింత స్పెషల్గా మారింది.