పవన్ కళ్యాణ్ : అజ్ఞాతవాసితో... కుదేలైన నిర్మాతలు?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని హారర్ సినిమాలు వస్తుంటే... మరికొన్ని క్రైమ్ అలాగే ప్రేమ కథ చిత్రాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి. అదే సమయంలో మరికొన్ని సినిమాలు... సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చి కూడా హిట్ అవుతున్నాయి. కొన్ని డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. అయితే... ప్రతి సినిమాకు నిర్మాత.. మూల స్తంభం లాంటివాడు.  అచ్చం అలాగే హారిక హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్  కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు సంస్థల అధినేతలు రాధాకృష్ణ అలాగే నాగ వంశీ అన్న సంగతి తెలిసిందే.


 వీళ్ల నిర్మాణంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా మిగలడం జరిగింది. అలాంటి సినిమాలలో అజ్ఞాతవాసి, బుట్ట బొమ్మ, ఆదికేశవ అలాగే రణరంగం సినిమాలు ఉన్నాయి.

 ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి సినిమా... అత్తారింటికి దారేది తరహాలో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రిజల్ట్ వచ్చేసరికి తిరగబడింది. సినిమా.. అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలే వచ్చాయి.

 ఇక మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా ఆది కేశవ సినిమా ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. కానీ థియేటర్కు వెళ్లేసరికి సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమా చూసి ఎందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అచ్చం అలాగే రణరంగం అలాగే బుట్ట బొమ్మ కూడా నాగ వంశీ, రాధాకృష్ణులకు... షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. అయినప్పటికీ... రాధాకృష్ణ అలాగే నాగ వంశీ ఇద్దరు నిర్మాతలు వెనక్కి తగ్గడం... లేదని తెలుస్తోంది. మంచి సినిమాలు వస్తే కచ్చితంగా... ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ద పడుతున్నారు నిర్మాతలు. ఈ ఫెల్యూర్స్ తర్వాత కూడా సక్సెస్ అందుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఒడిదడుకలు.. నిర్మాతలకు సహజమైన సంగతి తెలిసిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు. రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ ద్వారా.. నష్టపోయిన దిల్ రాజు... సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: