జగదేకవీరుడు అతిలోకసుందరి : 8 కోట్లతో రూపొందిన సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరీర్ను కొనసాగించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో చాలా ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించగా ... దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అశ్విని దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను మేకర్స్ ఎంత ఖర్చు పెట్టి రూపొందించారు. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాను ఆ సమయంలో దాదాపు 8 కోట్ల రూపాయలు పెట్టి చిత్రీకరించినట్లు తెలుస్తుంది. 8 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ట్రాక్ ను తెచ్చుకొని ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఏకంగా ఆ సమయంలో 13 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇకపోతే చిరంజీవి హీరోగా రాఘవేందర్రావు దర్శకత్వంలో మొత్తం 14 సినిమాలు వచ్చాయి. అందులో చిరంజీవి 12 సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక చిరంజీవి హీరోగా అశ్విని దత్ నిర్మాణంలో నాలుగు సినిమాలు రాగా అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి , ఇంద్ర మూవీలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవగా చూడాలని ఉంది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జై చిరంజీవ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: