బాలయ్య.. కేఎస్ రవికుమార్ కాంబోలో మొదట మిస్ అయిన మూవీ అదే.. అంతా ఓకే అయ్యాక క్లోజ్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఇక తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలను అందుకున్న దర్శకులలో కె ఎస్ రవి కుమార్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో మొదటగా జై సింహా అనే మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూలర్ అనే మూవీ వచ్చింది. జై సింహ మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా అయినటువంటి రూరల్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే జై సింహ మూవీ కంటే ముందే వీరి కాంబోలో ఓ మూవీ రావాల్సింది. కానీ అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. కొంత కాలం క్రితం రజనీ కాంత్ హీరోగా కథానాయకుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కే ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు.

ఇక జగపతి బాబు పాత్ర కోసం మొదట బాలయ్య ను రవి కుమార్ అనుకున్నాడట. ఆయనను సంప్రదించాడట. ఆయన కూడా ఓకే అన్నాడట. కానీ ఆ తర్వాత రజనీ కాంత్ , బాలయ్య తో నీ క్రేజ్ పెద్దది. నువ్వు అలాంటి చిన్న పాత్రలో నటిస్తే సినిమా తేలిపోయే అవకాశం ఉంది. అది నువ్వు నటించకుంటేనే బెటర్ అని అన్నాడట. దానితో బాలయ్య కూడా ఆ సినిమాలో నటించాను అని చెప్పాడట. ఆలయ బాలయ్య , రవి కుమార్ కాంబోలో మొదట సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: