ఫైనల్లీ ఆ రుణం తీర్చుకోబోతున్న పవన్ కళ్యాణ్.. ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేం రా బాబోయ్..!

Thota Jaya Madhuri
పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు.  డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తి సక్రమంగా నెరవేరుస్తున్నారు . అంతేకాదు ఒకపక్క  కమిట్ అయినా సినిమాలను కూడా చక చక కంప్లీట్ చేసే పనిలో కొత్త షెడ్యూల్ ని రెడీ చేసుకున్నారు.  ఇలాంటి మూమెంట్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త తెలుగు ఫిలిం సర్కిల్స్ బాగా సందడి చేస్తుంది .


మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా "జల్సా". ఎన్నిసార్లు చూసినా సరే ఈ సినిమా తనివి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది . త్రివిక్రమ్ అలాంటి ఒక స్పెషల్ కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు . మరి ముఖ్యంగా మహేష్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఈ సినిమా హిట్ కి మహేష్ వాయిస్ కూడా కారణమని చెప్పుకోక తప్పదు.


ఇప్పుడు పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు రుణం తీర్చుకోబోతున్నాడు . మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ స్పెషల్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట . అది కూడా ఓ ఇంపార్టెంట్ సీన్ కోసం అంటూ తెలుస్తుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన మాటలు కూడా పూర్తయ్యాయట. థియేటర్స్ లో మహేష్ లుక్స్ కి పవన్ వాయిస్ ఆడ్ అయితే ఇక ఫ్యాన్స్ ను ఆపగలమా . రచ్చ రంబోలా చేసేస్తారు. థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే . అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేయడానికి రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . మొత్తానికి రాజమౌళి ఒకే దెబ్బకి ఇద్దరు ఫ్యాన్స్ ని ఫిదా చేసేయబోతున్నాడు.  చూద్దాం రాజమౌళి నిర్ణయం ఏ వరకు సక్సెస్ అవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: