అరవింద్ స్వామిని వెంటాడిన అనారోగ్యం !

Seetha Sailaja
మణిరత్నం ‘రోజా’ ‘బొంబాయి’ సినిమాల ఘనవిజయం తరువాత అరవింద్ స్వామి టాప్ హీరోగా మారిపోతాడాని అప్పటి మీడియాతో పాటు ఆనాటితరం ప్రేక్షకులు కూడ అంచనాలు వేశారు. ఆసినిమాలు విడుదల అయిన తరువాత ఎవరు ఊహించని విధంగా ఈ విలక్షణ నటుడు సుమారు 12 సంవత్సరాలు  సినిమాలకు దూరంగా ఉన్నాడు.

దీనితో ఇతడు తన వ్యాపార వ్యవహారాలలో బిజీగా ఉండటంతో సినిమాలను పక్కకు పెట్టి ఉంటాడు అని చాలామంది అప్పట్లో భావించారు. లేటెస్ట్ గా విడుదలైన ‘సత్యం శివం’ మూవీలో హీరో కార్తీ తో కలిసి అరవింద్ స్వామి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ గతవారం ‘దేవర’ తో పోటీగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి ఒక పుష్కర కాలం సినిమాలకు దూరంగా ఎందుకు ఉండవలసింది అన్న విషయమై క్లారిటీ ఇచ్చాడు. సినిమాలతో మంచి బిజీగా ఉన్న సమయంలో ఒక ప్రమాదంలో తన వెన్ను పూసకు గాయం అవ్వడంతో ఆ గాయం బాధను తాను విపరీతంగా అనుభవించానని ఆగాయం నుండి కోలుకోకుండానే తనకు చిన్నపాటి పక్షవాతం రావడంతో ఆసమస్యల నుండి బయట పడటానికి తాను ఏకంగా 12 సంవత్సరాల పాటు ఎవరికీ కనపడకుండా ఉండవలసి వచ్చిన విషయాన్ని తెలియచేశాడు.

తనకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు తనను గుర్తించకపోవడం తనను మరింత బాధ పెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను కోలుకున్న విషయం తెలుసుకున్న మణిరత్నం తనకు మళ్ళీ ఆయన తీసిన ‘కడలి’ మూవీలో అవకాశం ఇవ్వడంతో తనకు మళ్ళీ అవకాశాలు రావడం మొదలయ్యాయి అని అంటున్నాడు. లేటెస్ట్ గా విడుదల అయిన ‘సత్యం శివం’ మూవీలో అతడి నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్ పాత్రలకు ఇండస్ట్రీలో అరవింద్ స్వామి చిరునామాగా కొనసాగుతున్న విషయం తెలిసిందే..      



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: