ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీ రిలీస్ కి రెడీ అయిన మాస్ ఎంటర్టైనర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అనేక సినిమాలు కాబోతున్నాయి. అందులో చాలా మూవీలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడాయి. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన మరో సినిమా కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.
 

కొంత కాలం క్రితం ప్రభాస్ , రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా , దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి.  

ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని అక్టోబర్ 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ హీరోగా రూపొందిన డార్లింగ్ మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ మూవీని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: