తెలుగు ప్రేక్షకులకు చియాన్ విక్రమ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అపరిచితుడు, ఐ వంటి సినిమాలతో ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్ టీం సోమవారం విజయవాడలో సందడి చేసింది. నగరంలోని గాంధీనగర్లో పేరు పొందిన బాబాయ్ హోటల్లో చిత్ర బృందం టిఫిన్ చేసింది. అక్కడికి వచ్చినవారితో హీరో విక్రమ్, హీరోయిన్ మాళవిక కాసేపు సరదాగా ముచ్చటించారు. సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా … విజయవాడ, గుంటూరుల్లో ఈరోజు మధ్యాహ్నం ప్రెస్మీట్స్ నిర్వహించనున్నారు. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందింది. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్లో కనిపించి అభిమానులను అలరించనున్నారు.2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మధురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీమ్. విజయవాడలోని బాబాయ్ హోటల్ కు వెళ్లారు. హీరో విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ తో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.