పాపం: డైరెక్టర్ పూరీకి తగ్గని లైగర్ తలనొప్పి.. మళ్లీ మొదటికేనా..?

Divya
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమందిని స్టార్ హీరోలు చేసిన ఘనత పూరి జగన్నాథ్ కి దక్కింది. తెలుగు తెరకు చాలామంది హీరోయిన్లను కూడా పరిచయం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్ సినిమా బారి దెబ్బ కొట్టింది. కానీ లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి మార్పులే పడ్డాయి. పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.

ఇప్పటికి పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ ని బిట్ చేసే డైరెక్టర్ మాత్రం ఎవరూ రాలేరని కూడా చెప్పవచ్చు. లైగర్ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసేలా చేశారట. సినిమా విడుదలైన తరువాత లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఒక్కసారిగా రోడ్డును పడ్డారు. తమకు జరిగిన ఈ నష్టాన్ని పూరి జగన్నాథ్ భర్తీ చేయాలని వరంగల్ శ్రీను తో పాటు మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నిరసనలు తెలియజేశారు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్లి ఈ ధర్నా చేయడం జరిగింది.

అయితే ఈ విషయం పైన పూరి జగన్నాథ్ పెద్దగా రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలోనే మళ్ళీ లైగర్ సినిమా పంచాయితీ ఒక్కసారి మీదికి వచ్చింది. లైగర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడక్షన్ కౌన్సిలింగ్లో పూరి జగన్నాథ్ కి కాస్త ఫేవరెట్ గా వచ్చినట్లు తెలుస్తోంది. నష్టాలు వచ్చిన సమయంలో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి చెల్లించాలనే నియమాలు కూడా లేవని డిస్ట్రిబ్యూటర్ మండలి తేల్చి చెప్పిందట. అయితే అది డైరెక్టర్ ఇస్తారో ఇవ్వకపోవడం అనేది అది పూరి జగన్నాథ్ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారట. మరి ఈ విషయం పైన పూరి ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మరి డైరెక్టర్ ఊరిని ఈ లైజర్ సినిమా మరి ఎన్నేళ్లు వెంటాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: