విజయ్ దేవరకొండ తో అలా చెయ్యడానికి భయపడ్డా..!?

Anilkumar
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే రష్మిక మందన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని ఎంతో కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక  ఈ విషయాలపై ఇప్పటి వరకు వీరిద్దరూ ఏమాత్రం స్పందించలేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో మంచి జంటగా పేరు తెచ్చుకోవడం తోనే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అన్న అనుమానాలకి తెరతీసింది. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా

 ఉన్న హీరోయిన్ రష్మిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో నార్త్‏లో ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దీంతో బాలీవుడ్‏లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువుతుంది. ఇటీవలే డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తోపాటు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో

 చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'గీత గోవిందం' సినిమా షూటింగ్‌ రోజులను గుర్తుచేసుకుంది రష్మిక. విజయ్‌తో కలిసి నటించేందుకు తొలుత కాస్త భయపడ్డానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ 'కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోలేను. వారితో మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే 'గీత గోవిందం' సెట్‌లో తొలిసారి విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా. అతని వ్యక్తిత్వం తెలిసే కొద్ది మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. విజయ్‌ చాలా కూల్‌గా ఉంటాడు. ఆయన సెట్‌లో ఉంటే అందరిలో పాజిటివ్‌ ఎనర్జీని నింపుతాడు' అని చెప్పింది నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: