రష్మిక : ఆ సమయంలో విజయ్ తో నటించాలంటే భయం వేసింది..!!

murali krishna
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరు ఎప్పుడు స్పందించలేదు. ఇక ఈ జంట గీతా గోవిందం సినిమాతో స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమాతోనే వీరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో నిజంగా లవ్ లో పడ్డారా అన్నట్లుగా కిస్సులు, హగ్గులతో రొమాన్స్ చేశారు.ఇలా వీరు ప్రేమలో ఉన్నట్లు పలు సార్లు నెటిజన్స్ బట్టబయలు చేసిందే. అయితే ఇదే క్రమంలో విజయ్ పై రష్మిక చేసిన ఇంటరెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎవరితోనైన ఫస్ట్ టైం మాట్లాడాలంటే చాలా భయమేస్తుందని తెలిపింది. ఒకట్రెంరోజులు అయితే గానీ వారితో కలిసిపోవడం కష్టం అంటూ వెల్లడించింది. అయితే గీతా గోవిందం చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించడానికి చాలా పడిపోయానని, కానీ ఆయన చాలా కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.
విజయ్ సెట్‌లో ఉంటే వెదర్ పాజిటివ్‌గా ఉంటుందని చెప్పింది. మొదట్లో భయపడ్డాను కానీ.. తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా ఈజీ అనిపించిందని, కాగా మూవీ షూటింగ్ సాఫీగా సాగిపోయిందని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో బ్యూటిఫుల్ కపుల్ అంటూ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.ఇక నేషనల్ క్రష్ రష్మిక అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఓసారి లవ్, ఓసారి ఎంగేజ్‌మెంట్, మరోసారి ఏకంగా పెళ్లే చేసుకోబోతున్నారంటూ పలువురు పలు రకాలుగా నెట్టింట ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మరీ ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ విజయ్-రష్మిక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. పూర్తి దృష్టి తమ కెరీర్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పుష్ప పార్ట్-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అలాగే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: