విజయ్ దేవరకొండ తో వివాదంపై మరోసారి స్పందించిన అనసూయ..!?

Anilkumar
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ రౌడీ హీరో విజయ్ దేవరకొండల మధ్య వివాదం ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుండి వీళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. అప్పటినుండి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు బాగా ఏర్పడ్డాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన కృషి ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగానే రౌడీ ఫ్యాన్స్ అందరూ అనసూయ పై ఇదే మంచి ఛాన్స్ అంటూ ట్రోల్స్ చేయడం కూడా ప్రారంభించారు.

 ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరీ వివాదం నిరంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ విజయ్ దేవరకొండ ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో సింబా సినిమా రూపొందుతుంది. తాజాగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో మీకు విజయ్‌ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం అంటూ అనసూయ స్కూటీ తుడుస్తుంటాడు ఓవ్యక్తి. ఆ డైలాగ్‌ బాగా పేలింది. ట్రైలర్‌ లో హైలైట్‌ అయ్యింది.   దీనిపై ఆమెకి ప్రశ్న ఎదురయ్యింది. విజయ్ దేవరకొండతో వివాదం ముగిసినట్టేనా? అనే ప్రశ్నకి అనసూయ మాట్లాడుతూ, ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం లేదు.

 సినిమా ద్వారా ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నానో, అప్పుడు కూడా జనాలకు మెసేజ్‌ ఇవ్వాలను రియాక్ట్ అయ్యాను. మనం ఫోకస్‌ అవుతున్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కానీ మితిమీరితే అది అందరికి తెలుస్తుంది. నిజానికి ఆ టైమ్‌లో మీకు ఎందుకు తప్పు అనిపించలేదు, మీరు ఎందుకు అడగలేదు? మీరంతా మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది.  అది ముమ్మాటికి మీ తప్పే, మళ్లీ మీరే నన్ను ఉల్టా బదనాం చేస్తున్నారు. దాని మూలంగా నేను ఎవరినీ హేట్‌ చేయడం లేదు. ఇది సరైన పద్ధతి, గౌరవం కాదు అని మాతమే చెప్పాను. దాన్నుంచి మనం అంతా నేర్చుకోవాలి. ఆ విషయం ద్వారా నేనూ నేర్చుకున్నాను. ఓరకంగా చెప్పాల్సింది, మరోరకంగా చెప్పాను. ఆ విషయంలో నేనూ నేర్చుకున్నాను` అని చెప్పింది అనసూయ. అలా అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: