పుష్ప 2 వివాదం: క్లారిటీ ఇచ్చిన టీం..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమాని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే సుకుమార్ బన్నీ మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం ఏమిటనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈనెల 25వ తేదీ నుంచి

 మొదలు కాబోతోంది.   ఐతే తాజాగా 'పుష్ప-2' సినిమా విషయంలో వినిపిస్తున్న నెగిటివ్‌ వార్తల్లో నిజం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ ప్రకటించింది. వివరాల్లోకెళ్తే ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు సుకుమార్‌ పనితీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తితో ఉన్నారని, సినిమా షూటింగ్‌ కూడా ఆగిపోయిందని, 'పుష్ప' పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసుకున్నది కూడా ఇందుకేనని పలు కథనాలు వెబ్‌ మీడియాలో కనిపిస్తున్నాయి . వీటిని చిత్రబృందం ఖండించింది. 'పుష్ప-2' విషయంలో అలాంటి

 వాటికి ఏమాత్రం తావు లేదని, సుకుమార్‌ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, అనుకున్నట్టే డిసెంబర్‌6న 'పుష్ప-2' ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని మేకర్స్‌ చెప్పారు. ఇదిలావుంటే.. ఈ నెల 25 నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2  ' కొత్త షెడ్యూల్‌ మొదలు కానున్నదట. ఈ నెల 28 నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొంటారని, ఈ షెడ్యూల్‌లోనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఊపిరి తీసుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: