పుష్ప: అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ.. ఇదే అసలు నిజం..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు పుష్ప షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ సుకుమార్ మధ్య తలెత్తిన విభేదాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాజీ విభేదాల వల్ల అల్లు అర్జున్ తన గడ్డం మొత్తం క్లీన్ చేసుకున్నాడట. సుకుమార్ ఎంత చెప్పినా కూడా ఈ విషయంలో తన మాట వినలేదట అల్లు అర్జున్. అలా అల్లు

 అర్జున్ చేసిన పనికి బాగా హార్ట్ అయిన సుకుమార్  ఫ్యామిలీని తీసుకుని అమెరికా వెకేషన్ కి వెళ్ళిపోయాడట. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ సైతం తన ఫ్యామిలీని తీసుకొని యూరప్ కి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మూడు యూనిట్ల తో షూటింగ్ చేయాలి అని అల్లు అర్జున్ కోరితే సుకుమార్ మాత్రం ఈ విషయంలో అల్లు అర్జున్ మాట వినడం లేదట. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు తలెత్తినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వార్తల్లో నిజమెంత అన్న విషయంపై డిజిటల్ టీం కి సంబంధించిన శరత్ చంద్ర అనే వ్యక్తి క్లారిటీ ఇచ్చాడు. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు ఆయన   కామెంట్

 చేశాడు. సుకుమార్ గారు ఈ సినిమా ఎడిటింగ్ పని మొదలుపెట్టాడని, ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ చేస్తున్న నేపద్యంలో ఆయన బ్రేక్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్ అని ఆయన అన్నారు. దానికి మరొక అభిమాని షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒకసారి చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ఇప్పుడు టైం ఉంది ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ఎడిటింగ్ షూటింగ్ అయినాక చేసుకోవచ్చు. హ్యాపీగా డిసెంబర్ 6వ తారీకున సినిమాని రిలీజ్ చేయొచ్చు అందుకే అలా చేసుకుంటూ ఉండవచ్చు అని కామెంట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మంచి ఏర్పడిన విభేదాలు అంటూ జరుగుతున్న వార్తలకు అల్లు అర్జున్ టీం నుంచి క్లారిటీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: