టాలీవుడ్ లో నటుడు సమీర్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా చేశారు. అలాగే తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి సమీర్ ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన తాజాగా జగన్ పై చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు కేవలం ఆమె ఒక్కదాని వల్లే వైసిపి వాళ్లు కొట్టుకునే స్టేజ్ కి వచ్చారు అంటూ సంచలన కామెంట్లు చేశారు.విషయంలోకి వెళ్తే..జగన్ ప్రభుత్వం సినిమా వాళ్ళని ఎంత నీచంగా చూసిందో చెప్పనక్కర్లేదు .
మరీ ముఖ్యంగా సినిమా పెద్దలు ఆయన్ని కలవడానికి వస్తే గేటు బయటే కార్లు ఆపేసి నడుచుకుంటూ రప్పించారు. అలాగే పెద్దపెద్ద వాళ్లతో చేతులు జోడించి నమస్కారం పెట్టించుకున్నారు.అంతేకాకుండా బెనిఫిట్ షోలు తీసేసారు.టికెట్ల రేట్లు తగ్గించారు. ఇలా ఎన్నో జరిగాయి.దాంతో సినిమా ఇండస్ట్రీ వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపించింది. ఇదంతా పక్కన పెడితే జగన్ ప్రభుత్వం ఓడిపోయాక ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించిన వార్తలు మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. అంతేకాదు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాననే భ్రమలో రాజభవనాలు కట్టించుకున్నారని,ఈ ప్యాలెస్ వెనక చాలామంది పెద్దపెద్ద వారి హస్తాలు ఉన్నాయని,ప్రజల సొమ్ముతో రాజభోగం అనుభవించాలని చూశారంటూ టిడిపి వాళ్ళు విమర్శించారు.
అయితే తాజాగా ఋషికొండ ప్యాలెస్ గురించి నటుడు సమీర్ మాట్లాడుతూ..ఋషికొండ ప్యాలెస్ తన భార్య భారతి కోసమే జగన్ కట్టించారు.ఆమె ప్యాలెస్ నుండి చూస్తే బీచ్ కనిపిస్తుంది. ఆమె మొహం లో సంతోషం చూడడం కోసమే జగన్ ఇలాంటి పని చేశారు. ఇక జగన్ ఆమెని కాదని ఏ పని కూడా చేయరు. అంతేకాదు వైసిపిలో నేతలు గొడవలు పడడానికి ప్రధాన కారణం కూడా భారతి వల్లే.. అంటూ సమీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు