మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఘట్టమనేని వరసుడి గ్రాండ్ ఎంట్రీ..!?

Anilkumar
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగిన చాలామంది హీరోల వారసులు ఇప్పటికీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉన్నారు. అయితే అలా తమ అభిమాన హీరోల వారసులు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అంటే చాలా సంతోషిస్తారు వారి అభిమానులు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో నందమూరి నటసింహ బాలకృష్ణ అక్కినేని నాగార్జున మహేష్ బాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా చాలామంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన

 రమేష్ మహేష్ బాబు మొదట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రమేష్ హీరోగా పెద్ద గుర్తింపు తెచ్చుకోలేక పోయినప్పటికీ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఘట్టమనేని మూడో తరం నటుడిగా ఘట్టమేని గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకే ఇప్పటి నుండే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్నాడు. ఒకవైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూ మరో వైపు న్యూయార్క్ లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్

 అవబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. గతంలో మహేష్ నటించిన 1నేనొక్కడినేలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు గౌతమ్. కానీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉంటాయి. సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం గౌతమ్ కు ప్లస్ పాయింట్, కానీ మహేష్ లెగసీ కంటిన్యూ చేసి, అభిమానుల అంచనాలను అందుకోవాలంటే నటనలో పరిణితి సాధించాలి. అందుకోసమే ఇప్పటి నుండే గౌతమ్ కు శిక్షణ ఇప్పించబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: