ఈ వయసులో ఆ స్టార్ హీరోయిన్ పై మోజు పడుతున్న నాగార్జున..!?

Anilkumar
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఒకప్పుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు అని అందరూ అంటూ ఉంటారు. ఆ రోజుల్లోనే చాలామంది స్టార్ హీరోయిన్లతో కలిసి నటించాడు నాగార్జున. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం నాగార్జునతో సినిమా చేయడానికి క్యూ కట్టేవారు. అయితే అప్పట్లో టాలీవుడ్ నే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ పై మోజు పడినట్లుగా తెలుస్తోంది. తనతో కలిసి నటించాలి అని ఎంతో ప్రయత్నించాడట నాగార్జున. కానీ ఆమె నాగార్జునతో నటించడానికి

 భారీగా డిమాండ్ చేసిందట. దాంతో సైడ్ అయిపోయాడట నాగార్జున.  ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురి దీక్షిత్. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన మాధురీ దీక్షిత్ మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనుకున్నా సినీ రంగంమీద ఆసక్తితో ముందు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. కథక్ నృత్యం 8 ఏళ్లుగా నేర్చుకోవడంతో అది ఆమె సినీ కెరీర్‌ను ఎక్కడికో తీసుకువెళ్లింది. 1984లో మాధురి దీక్షిత్ హీరోయిన్‌గా అబోద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తేజాబ్ సినిమాతో బాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది. అక్కడ నుంచి ఆమె వరుస హిట్లతో వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆ

 టైంలో మాధురి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరుసగా గెలుచుకుని దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఆ టైంలో నాగార్జున మాధురి దీక్షిత్‌ను తెలుగులోకి తీసుకు రావడానికి చాలా ట్రై చేశాడట. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అంత యాక్టివ్గా సినిమాలు చేయడం లేదు నాగార్జున. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేనితోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం నటిస్తున్న విషయం తెలసిందే. వీరితోపాటు జిమ్ సర్భ్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: