రొమాన్స్ లో మితిమీరిపోతున్న యానిమల్ బ్యూటీ.. ఈసారి ఏకంగా స్టార్ తో..!?

Anilkumar
యానిమల్ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న తృప్తి  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది.   ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. కేవలం ఒకే ఒక్క సినిమాతో తన జాతకం మొత్తం మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా  తర్వాత తనకి వలస సినిమాల్లో నటించే అవకాశం దక్కుతుంది. అంతేకాదు ఈ సినిమాలో తన బోల్డ్ నెస్ మొత్తం చూపించి ఆ తర్వాత కూడా

 బోల్డ్ బ్యూటీగా కొనసాగుతోంది ఈ నటి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగానే పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ లో మరొక అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్‌ నటిస్తున్న 'తేరే ఇష్క్‌ మే' చిత్రంలో కథానాయికగా త్రిప్తి పేరును ఖరారు చేశారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ధనుష్‌-ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రాన్‌జనా' విషాద ప్రేమకథగా ప్రేక్షకుల్ని మెప్పించింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత వీరిద్దరు కలిసి పనిచేస్తుండటంతో 'తేరే ఇష్క్‌ మే' చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. 'రాన్‌జనా' తరహాలోనే వారణాసి నేపథ్య

 కథాంశంతో 'తేరే ఇష్క్‌ మే' చిత్రం తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ధనుష్‌ ప్రేమికురాలిగా త్రిప్తి దిమ్రి కనిపించనుంది. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. త్రిప్తి ద్రిమి నటించిన తాజా చిత్రం 'బ్యాడ్‌న్యూస్‌’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో మరో సినిమాలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా జూలై 19 విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ లీడ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన త్రిప్తి డిమ్రీ, అమీ వర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: