సాయి పల్లవి : ఆ వ్యక్తితో 10 సంవత్సరాలు రిలేషన్ లో వున్నా..?

murali krishna
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే చాలామందికి నచ్చేసింది. కొందరు ఆమె నటనకి ఫ్యాన్స్ అవుతుండగా, మరికొందరు ఆమె డాన్స్ కి కూడా ఫిదా అయిపోతున్నారు.ప్రేమమ్' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కొన్ని కండిషన్స్ పెట్టుకొని నటించడం, ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈమెపై మరింత అభిమానం పెరిగిపోయింది. ప్రస్తుతం 'రామాయణం'లో సీత పాత్రలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో తాజాగా ఈమె డ్రీమ్ బాయ్ గురించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..?
గతంలో సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడింది. అదే విషయం తాజాగా వైరల్ అవుతుంది. ఈమె ఏకంగా 10 ఏళ్లుగా ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నానంటూ చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా నా డ్రీమ్ బాయ్ అంటూ అతని పేరు చెప్తూ మురిసిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తన లవ్ స్టోరీని సాయి పల్లవి ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచింది? అని ఉలిక్కిపడుతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకుని సాయి పల్లవి చమత్కారానికి ఫిదా అవుతున్నారు. అయితే సాయి పల్లవికి ఇష్టమైన వ్యక్తి ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు. తనకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘రామాయణం’ సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రణబీర్, సాయి పల్లవి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఖచ్చితంగా సంచలన విజయం సాదిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: