వెంకీ నెక్స్ట్ నుండి క్రేజీ అప్డేట్.. డిఫరెంట్ పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెంచేశారుగా..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇకపోతే చాలా రోజుల నుండి ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను అనిల్ రావిపూడి చేస్తున్నాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ పూజ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం విడుదల చేసింది.
 

తాజాగా ఈ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఎస్ వి సి (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) బ్యానర్ లో 58 వ సినిమా పూజా కార్యక్రమాలు రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాలకు జరగనున్నట్లు , ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నట్లు , శిరీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఒక వైపు తాళి బొట్టు మరియు గన్ ఉంది.

అలాగే మరో వైపు ఒక ఎర్రని గులాబీ మరియు ఐపీఎస్ లోగో ఉన్న బ్యాడ్జ్ ఉంది. ఇలా ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ అత్యంత డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ఈ పోస్టర్ తోనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలు రేపు మూవీ బృందం విడుదల చేస్తుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: