చరిత్ర సృష్టించిన మహేష్? కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!

Purushottham Vinay

ఇప్పుడంటే వసూళ్ళని బట్టి సినిమా రికార్డ్స్ ని లెక్కిస్తున్నారు కాబట్టి ఒకప్పుడు రికార్డ్ అంటే  వసూళ్లతో పాటు ఆ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఆడింది ఎన్ని రోజులు ఆడింది అంటూ మాట్లాడుకునేవాళ్ళు.కానీ ఇప్పుడు రికార్డ్స్ అంటే కేవలం ఎంత వసూలు చేసింది అని అనుకుంటున్నారు. కేవలం వసూళ్లు మాత్రమే ఇప్పుడు సక్సెస్ కి కొలమానం అయిపోయాయి. ఒకప్పుడు పల్లెటూర్లలో ఒక సినిమా విడుదల అవుతుంది అని తెలియాలి అంటే గోడ మీద పోస్టర్స్ కనిపించేవి. కానీ ఈ రోజుల్లో మాత్రం అది చాలా అరుదుగా జరుగుతుంది.ఇకపోతే గత కొంతకాలం నుంచి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చాలా సినిమాలు కొన్ని నెలల వ్యవధిలోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు అయితే కేవలం వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా ఇంట్లో చూడాలి అని అంటే ఒరిజినల్ గా ప్రింట్ వస్తే ఆ సినిమా డివిడి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా కూడా ప్రేక్షకుడి చేతిలోకి వచ్చేసిందని చెప్పొచ్చు. 


ఇకపోతే ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఆడటం చాలా కష్టమైపోయింది.ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా చాలా సంవత్సరాల తర్వాత 50 రోజులు పాటు ఆడింది. అలానే ఆ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా కూడా 50 రోజులు ఆడింది. ఈ రెండింటిని బద్దలు కొడుతూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఏకంగా 175 రోజులు పాటు ఆడింది. 93 ఏళ్ల సినిమా చరిత్రలో ఇది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పొచ్చు. దాదాపు 7 సినిమాలు మహేష్ బాబు నటించినవి 175 రోజులు పాటు ఆడి రికార్డులు సృష్టించాయి. ఇకపోతే చిలకలూరిపేటలో వెంకటేశ్వర థియేటర్ లో గుంటూరు కారం సినిమా 175 వ రోజులు ఆడింది. ఈ సినిమాకి ముందు నెగిటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చి హిట్ సినిమాగా నిలిచింది. 250 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ సినిమా రికార్డులకి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: