ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన దర్శకుడు శంకర్..?
‘గేమ్ ఛేంజర్ చిత్రంకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. భారతీయుడు 2 విడుదలైన వెంటనే షూటింగ్ మొదలెడతాం. గేమ్ ఛేంజర్, భారతీయుడు చిత్రాలకు అస్సలు పోలికే లేదు. భారతీయుడుకి పార్ట్ 3 కూడా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం రెండో భాగం ఉండదు. గేమ్ ఛేంజర్ స్టోరీకి స్కోప్ లేదు’ అని డైరెక్టర్ ఎస్ శంకర్ చెప్పారు. శంకర్ తీసిన రోబో, భారతీయుడు చిత్రాలకు సీక్వెల్ ఉన్నాయి. ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ చిత్రాలకు సమయం వచ్చినపుడు సీక్వెల్ తీస్తానని శంకర్ పేర్కొన్నారు.గేమ్ ఛేంజర్ చిత్రంకు సంబందించి రామ్ చరణ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కరోనా టైంలో ప్రకటన వచ్చిన ఈ చిత్రం.. దీపావళికి థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఇది మిస్సయితే క్రిస్మస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.