షాకింగ్: 'మట్కా' కోసం రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న వరుణ్ తేజ్..!?

Anilkumar
గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇందులో భాగంగానే వరుణ్ తేజ్ చేస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా మట్కా. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే ఈ షూటింగ్ దాదాపుగా 35 రోజుల వరకు ఉంటుంది అని ముందుగానే ప్రకటించారు చిత్రబృందం. అయితే దాదాపుగా ఒక్క ఫేస్ కె 15 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. వైజాగ్ లొకేషన్స్ ను రామోజీ ఫిలిం సిటీ లో రీ క్రియేట్ చేస్తున్నారు చిత్రబంధం. అందుకే ఇంతలా బడ్జెట్ పెరుగుతుంది అన్న సమాచారం

 వినబడుతోంది. ఇకపోతే వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా దేశాన్ని కదిలించిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం దాదాపుగా 50 కోట్ల దాకా ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ పెరగడంతో వరుణ్ తేజ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  తన రెగ్యులర్ రెమ్యునరేషన్ 12 కోట్లు తీసుకోవాలి. కానీ ఆ బడ్జెట్ వెళ్లి ప్రొడక్షన్ పై

 పడకుండా సగానికి సగం తగ్గించి అంటే ఆరు కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ...కొన్ని ఏరియా రైట్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. మట్కా సినిమాలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  , నోరా ఫతేహి, మీనాక్షి చౌదరితోపాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విశాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా అప్పట్లో విశాఖ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి ఓ భారీ సెట్టింగ్ కి భారీ ఖర్చుతో మేకర్స్ వేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: