అఫీషియల్ : "హరిహర వీరమల్లు" గురించి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఇక పండగే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే ఫాంటసీ మూవీని ప్రారంభించాడు. ఈ సినిమా ప్రారంభించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశాడు. ఇక పవన్ ఎక్కువ శాతం ఆ సినిమాపైనే ఫోకస్ పెట్టడంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దానితో టైం వేస్ట్ చేయకుండా క్రిష్ కూడా కొందపోలం అనే మూవీని మొదలు పెట్టాడు. ఇక వీరిద్దరూ హరిహర వీరమల్లు సినిమాని పక్కన పెట్టి పూర్తి చలో సినిమాను పూర్తి చేసి విడుదల కూడా చేశారు. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత భాగం పూర్తి కాగానే మళ్లీ ఈ సినిమా ఆగిపోయింది. దానితో ఈ మూవీ మొత్తానికి ఆగిపోయింది, ఇక విడుదల కాదు అని వార్తలు వచ్చాయి. దానితో ఈ సినిమా నిర్మాత రత్నం ఈ సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుంది.

ఇది చాలా గ్రాఫిక్స్ పనులు ఉన్న సినిమా అందుకే కొంచెం టైం పడుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పదేపదే ఆగిపోతూ ఉండడంతో క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. ఈ సినిమా మిగిలి ఉన్న షూటింగ్ దర్శకత్వ బాధ్యతలను కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.

అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి రత్నం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. తాజాగా ఆయన హరిహర వీరమల్లు మొదటి భాగానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ప్రస్తుతం పలు దేశాల్లో జరుగుతున్నాయి అని తెలిపారు. అలాగే ఈ సినిమాలోని టైగర్ ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: