వైఎస్ భారతి: సాక్షికి గుడ్ బై చెప్పినట్టేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ముఖ్యంగా ఆయనకు సపోర్టుగా సాక్షి ఛానల్ న్యూస్ పేపర్ కూడా ఉన్నది. వీటిని గత కొన్నేళ్లుగా ఆయన భార్య వైయస్ భారతి దగ్గరుండి మరి చూసుకోనెదట. అయితే 2024 ఎన్నికలలో జగన్ గోరంగా ఓడిపోవడంతో ఆయన భార్య వైయస్ భారతి సాక్షి ఛానల్ కు గుడ్ బై చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సాక్షి కూడా ఒక కారణమని అంతర్గత చర్చలు కూడా జరగడంతో భారతి పైన కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ విషయం భారతీ దగ్గర వరకు వెళ్ళగా సాక్షి ఛానల్ కు గుడ్ బై చెప్పాలని మిగతా వ్యాపారాలను కేవలం తాను దగ్గరుండే చూసుకుంటానని జగన్కు చెప్పేసిందట. ఇందుకు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం వైయస్ భారతి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన రాణి రెడ్డి అనే వ్యక్తి సాక్షి ఎండిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాణి రెడ్డి సాక్షి గ్రూప్ కార్పొరేట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఎడిటింగ్ బాధ్యతలు తప్ప సాక్షికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈమె దగ్గరుండి చూసుకొనే వీలు వైయస్ కుటుంబం కల్పించినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం పైన అటు వైయస్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అందుకు గల కారణాలు ఏంటనే విషయం ఇంకా ఇప్పటికి అభ్యర్థులకు అర్థం కావడం లేదు.. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రజలతో మమేకం అయ్యేలా పలు రకాల సన్నహాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరొకసారి యాత్ర మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: