'గ్లోబల్ స్టార్' పై షాకింగ్ కామెంట్స్ చేసిన 'మంచు డాటర్'..?

murali krishna
టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు లక్ష్మీ పేరు సుపరిచితమే.. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో విలక్షణ నటిగా ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా వ్యాఖ్యతగా వ్యవహారిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంది..ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇక ఇటీవలె యక్షిణి అనే మూవీలో నటించి మెప్పించింది. ఇలా తెలుగులో మూవీస్ చేస్తూనే బాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయి ఓ అపార్ట్‌మెంట్ కూడా తీసుకుని అక్కడే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. నేను మొదట్లో ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. అప్పుడు నేను రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలియదు. రామ్ చరణ్ కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేను అపార్ట్‌మెంట్ తీసుకున్నాక అక్కడినుంచి షిఫ్ట్ అయ్యాను అని తెలిపింది.మాములుగా ముంబైలో ఇల్లు దొరకడం కష్టం అని చాలా మంది చెప్పారు.. కానీ చాలా ఇళ్లని చూశానని, ఆ దేవుడే ఈ ఇంటికి తీసుకొచ్చాడంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లోని ఆర్ట్ వర్క్‌ని చూపించింది.. గతంలో హైదరాబాద్ లో చేసిన హోమ్ టూర్ వీడియోకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అందుకే ఇప్పుడు ముంబై ఇంటి హోమ్ టూర్ చేసినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ కొత్త ఇంటి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేవిధంగా నేను రానా, చరణ్, ఇలా ఆల్మోస్ట్ 142 మందికి కలిపి మాకు ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మా సినిమాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్లమే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మంచు-మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. ఆ చనువు వల్లే చరణ్ ఇంట్లో మంచు లక్ష్మి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: