ముంబైలో చరణ్ ఇంట్లో ఉండడానికి అదే కారణం.. మంచు లక్ష్మి..!

MADDIBOINA AJAY KUMAR
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సిద్ధార్థ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందిన అనగనగా ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమాలో మంచు లక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె అనేక తెలుగు సినిమాలలో నటించింది.

అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో నటించింది. ఇక ఈమె కొన్ని టీవీ ఓ టి టి షో లకు , హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితమే ముంబై కి వెళ్ళింది. ఆ విషయం గురించి ఈమె చెబుతూ ఇక్కడ కంటే ముంబైలో అవకాశాలు ఎక్కువ వస్తాయి అని , అలాగే తన కూతురు భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ముంబై వెళ్ళినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పింది. ఇకపోతే తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె ముంబై లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో కొద్ది కాలం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనిపై మంచు లక్ష్మి తాజాగా స్పందించింది.

తాజాగా ఈమె మాట్లాడుతూ ... కొంత మంది స్నేహితులు నన్ను ముంబైకి రమ్మని అన్నారు. నేను ముంబై వెళదాము అని డిసైడ్ అయిన కొత్తలో నాకు అక్కడ ఇల్లు లేదు. దానితో ఎక్కడ ఉండాలా అని నేను అనుకున్నాను. ఇక అదే సమయంలో రామ్ చరణ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండి తర్వాత వేరే ఇంటికి మారాను అని ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే మొదట మంచు లక్ష్మి ముంబై వెళతాను అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వారు కూడా వద్దన్నారట. ఎందుకు అంటే మంచు లక్ష్మి మరియు తన కుటుంబ సభ్యులు ఎంతో కలిసిమెలిసి ఉంటారట. ఆలా మంచి బంధం ఉన్న వ్యక్తి ఇంట్లో నుండి వేరే ప్రదేశంలోకి వెళతాను అనడంతో బాధ వల్ల వారు నన్ను ఇంట్లో నుండి వెళ్ళనివ్వలేదు అని ఆమె చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: