ప్లాన్ మార్చిన పవన్ కల్యాణ్..ఆ సినిమాకే మొదటి ప్రాధన్యత..

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాలు వున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో వున్నాయి..అయితే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.అందుకే సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు తరువాత పవన్ షూటింగ్స్ లో పాల్గొంటాడని భావించిన నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ డేట్స్ కోసం  నిర్మాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా.. ఏ.ఎం రత్నం నిర్మాణంలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఈ రెండు కూడా ముందుగా పూర్తి చేయాల్సి ఉంది.అయితే పవన్ ఓజీ సినిమాను ముందుగా రిలీజ్ చేస్తాడని అంతా అనుకోగా ఇప్పుడు ప్లాన్ మార్చి వీరమల్లుని పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.. 

ఓజీ సినిమాను ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేసారు.ఆ సినిమాకు మరి కొన్ని రోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తి అవుతుంది.కానీ ఇప్పుడు వీరమల్లుని ముందు పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.. ఓజీని వాయిదా వేసి హరి హర వీరమల్లు సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగినట్టుగా తన షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్ ను తెర మీద చూడాలని వున్న ఫ్యాన్స్ ఆయనది ఏ సినిమా వచ్చిన కూడా పర్లేదని చెబుతున్నారు.దీనితో ఈ డిసెంబర్ కి పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయనుంది. క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన ఈసినిమా నాలుగేళ్లు అవుతున్నా పూర్తి కాకపోయేసరికి దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు.. ప్రస్తుతం నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: