ఓన్లీ సీక్వెల్స్ అంటున్న సుకుమార్.. ఈసారి ఆ మూవీ పై గురిపెట్టిన దర్శకుడు..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఆర్య మూవీతో దర్శకుడిగా కెరీర్లు మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత నుండి కూడా ఈయన దర్శకత్వం వహించిన ఏదో ఒకటి , రెండు సినిమాలు తప్పిస్తే అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఆ తర్వాత మంచి ఆదరణను ప్రేక్షకుల నుండి దక్కించుకున్నాయి. దానితో ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అంటే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇకపోతే సుకుమార్ "ఆర్య" మూవీకి కొనసాగింపుగా ఇప్పటికే ఆర్య 2 అనే మూవీని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్య మూవీతో పోలిస్తే ఆర్య 2 అంతస్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుతుంది. సుకుమార్ ఆఖరుగా అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీకి దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంతకాలం క్రితం సుకుమార్ , రామ్ చరణ్ హీరోగా రంగస్థలం అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రంగస్థలం మూవీ కి సీక్వెల్ అని వార్తలు వస్తున్నాయి.

ఇక నిజంగానే సుకుమార్ , చరణ్ తో రంగస్థలం మూవీకి సీక్వెల్ తీసినట్లు అయితే ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం అత్యంత భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకు అంటే రంగస్థలం మూవీ ఆ సమయంలో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మరి నిజంగానే సుకుమార్ , రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ కి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడా ..?  లేక కొత్త కథతో సినిమాని ప్లాన్ చేస్తున్నాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: