మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కీరవాణి.. 'SSMB29' స్టార్ట్ అయ్యేది అప్పుడేనట!

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా ఫిక్స్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. కేవలం తెలుగు సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న సినీ ఆడియన్స్ అందరూ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి. అయితే తాజాగా వీళ్ళిద్దరికీ కాంబోలో రాబోయే సినిమా గురించి  అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం  కీరవాణి. ఇక అసలు మేటర్ లోకి వెళితే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఫ్లాప్ అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.  ఇక ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా జపాన్ ఆడియన్స్ హాలీవుడ్ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఉండబోతుంది అన్న సమాచారం వినబడుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ బయట పెట్టారు కీరవాణి. అదేంటంటే తాజాగా ఆయన

 మాట్లాడుతూ.." మహేష్ బాబు, రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయ్యింది అని.. ఈ వారమే స్టోరీని లాక్ చేశారు అని.. మహేష్ బాబు పై రాజమౌళి బెస్ట్ షూట్ కూడా చేస్తున్నారు అని.." ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా సంస్థకి ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మరొకవైపు ఈ వార్త విన్న మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎప్పటినుండో దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ  అధికారిక ప్రకటన మాత్రం లేదు. కానీ ఇప్పుడు స్వయంగా కీరవాణి వీళ్లిద్దరి కాంబోలో రాబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో మహేష్ అభిమానులు కాస్త కూల్ అయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: