ఆ విషయంలో "వీర సింహారెడ్డి" ని ఫాలో కానున్న "ఎన్బికె 109" యూనిట్..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి బాలకృష్ణ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ కలిగిన మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా,  శృతి హాసన్ హాని రోజుల హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2023 జనవరి 12వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 107 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను "ఎన్ బి కె 107" అనే వర్కింగ్ టైటిల్ తోనే పూర్తి చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందుగానే ఈ మూవీ యూనిట్ ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించి ఈ సినిమాకు వీర సింహా రెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేసింది.

మూవీ యూనిట్ చేసినట్లుగానే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "ఎన్ బి కే 109" మూవీ యూనిట్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, బాబి దర్శకత్వంలో "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ విడుదలకు సంబంధించి ఓ భారీ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు అందులోనే ఈ మూవీ టైటిల్ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి "ఎన్ బి కే 109" మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: