కిరాణా కొట్టు పవిత్ర కోటీశ్వరాలు ఎలా అయ్యిందంటే?

Purushottham Vinay
రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని శక్ చేస్తుంది. స్టార్ హీరో దర్శన్ తన ప్రియురాలి మోజులో పడి వీరాభిమానినే దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు అతను జైలు పాలయ్యాడు. ఈ మర్డర్ కేసులో దర్శన్, పవిత్రగౌడతో సహా మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని.. అలాగే రేణుకాస్వామి భార్యకు ఖచ్చితంగా న్యాయం జరగాలని అటు ప్రజలు ఇటు సినీతారలు కోరుతున్నారు. అయితే దర్శన్ తన అభిమానిని ఇంత దారుణంగా హింసించి హత్య చేయడానికి ప్రధాన కారణం అతను అమితంగా ప్రేమించిన ప్రియురాలు పవిత్ర గౌడ. ఇప్పటికే పెళ్లై ఒక బాబు ఉన్న దర్శన్.. గత పదేళ్ల నుంచి  పవిత్ర గౌడతో డేటింగ్ లో ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి పవిత్రగౌడకు.. దర్శన్ భార్య విజయలక్ష్మికి సోషల్ మీడియాలో పెద్ద గొడవలే జరిగాయి. దీంతో దర్శన్ వీరాభిమాని రేణుకస్వామి పవిత్రగౌడకు నెట్టింట అసభ్యకరంగా మెసేజ్ లు చేయడం.. ట్రోల్స్ చేయడంతో దర్శన్ అతడిని కిడ్నాప్ చేయించి మరీ హత్య చేశాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నెట్టింట పవిత్ర గౌడ పేరు బాగా మారుమోగుతుంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ చిన్న కిరాణా షాపు యజమాని కూతురు ఇప్పుడు ఇంత పెద్ద కోటీశ్వరాలు ఎలా అయ్యింది ? అంటూ నెట్టింట ఆమె గురించి పెద్ద చర్చే జరుగుతుంది.


నటి పవిత్ర గౌడ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఒక కిరాణా కొట్టు యజమాని. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది.అలాగే పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో కూడా కనిపించింది. అలాగే మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరుగా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేసి.. ఆ తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా కనిపించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు ఆమె దూరమైంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడకు అంతగా గుర్తింపు కూడా రాలేదు. కేవలం హీరో దర్శన్‌తో ఉన్న అనుబంధం వల్ల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పైగా పవిత్ర గౌడకు ఇదివరకే పెళ్లైంది. సంజయ్ సింగ్ అనే సామాన్యుడిని పెళ్లి చేసుకున్న పవిత్ర కొన్ని రోజులకే అతనితో విడాకులు తీసుకుంది.


అంతేగాక వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న పవిత్రకు హీరో దర్శన్‏తో పరిచయం ఏర్పడి వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది.దర్శన్‏తో  లివ్ ఇన్ రిలేషన్ షిప్‏తో పవిత్ర గౌడ ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది. విలాసవంతమైన జీవితం గడుపుతున్న పవిత్ర గౌడకు ఆర్ఆర్ నగర్‌లోని మూడంతస్తుల ఇంటిని కూడా దర్శన్ బహుమతిగా ఇచ్చాడు. ఇక ఓ లగ్జరీ కారు విషయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్రకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవ కూడా జరిగింది. భార్యకు దర్శన్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని తెలిసి తనకు అదే కారు కావాలని పట్టుబట్టింది పవిత్ర గౌడ. దీంతో తన భార్య విజయలక్ష్మికి ఇచ్చిన మోడల్ కారునే పవిత్రగౌడ్ కు కూడా బహుమతిగా ఇచ్చాడు. పవిత్ర ఉంటున్న ఇంటిని కూడా దర్శన్ స్వయంగా కొనిచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: