నాగచైతన్య 'తండేల్' షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్  పతాకం పై బన్నీ వాస భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా మొత్తం

 శ్రీకాకుళం లో జరిగిన ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొంది. అందుకే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చందు  కార్తికేయ టు సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాంటి విజయాన్ని అందుకోవాలి అని సినిమాకి సంబంధించిన అన్ని పనులను చాకచక్యంగా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత తండేల్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందా అని అభిమానుల సైతం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే

  వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ప్రేమ సవ్యసాచి వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. ఇదివరకు వచ్చిన సినిమాలతో మంచి హిట్ కాంబో అని పేరు పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ సినిమాతో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. లవ్ అండ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే   ఈ సినిమా తర్వాత షెడ్యూల్ జూన్ 10 నుండి రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ చేయబోతున్నట్లుగా తాజాగా సమాచారం వినబడుతోంది. ఇక ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: