రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి 17 ఏళ్లు..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ హీరో గా నయన తార హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో దుబాయ్ శీను అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జెడి చక్రవర్తి ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2007 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయ్యింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇకపోతే 2007 వ సంవత్సరం విడుదల అయ్యి ఆ సమయంలో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి అయింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు పూర్తి అయిన కూడా ఈ మూవీ ఇప్పటికీ టీవీ లో ప్రసారం అయిన ప్రతిసారీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా కంటే ముందు రవితేజ , శ్రీను వైట్ల కాంబో లో కొన్ని మూవీ లు రూపొందాయి. దానితో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఈ మూవీ ని సీరియస్ యాంగిల్ లో కంటే కూడా కామెడీ యాంగిల్ లోనే ఎక్కువగా తీర్చిదిద్దడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అందులో ఆయన ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ మూవీ లో నయన తార తన నటనతో పాటు , గ్రామర్ తో కూడా ఈ మూవీ కి స్పెషల్ అట్రాక్షన్ ను తీసుకు వచ్చింది. ఇక రవితేజ తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ఈ సినిమాలో సూపర్ గా కామెడీ ని పండించాడు. ఇలా ఆ సమయం లో ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: