వామ్మో.. ఇండియన్ 2 వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
లోక నాయకుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. జూలై 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు చిత్రబంధం. అయితే తాజాగా   చెన్నైలో సినీ ప్రముఖుల

 సమక్షంలో ఆడియో వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఆ వేడుకకు హీరో శింబు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెల్సన్ నిర్మాత ఏఎం రత్నం అలాగే సునీల్ నారాయణ   వంటి వారందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇకపోతే వారితోపాటు శృతిహాసన్ మౌని రాయి శంకర్ కూతురు అతిధి శంకర్ కొడుకు  కూడా వచ్చారు. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు లోకనాయకుడు కమలహాసన్. దీంతో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 అయితే " 28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా సమయంలో నేను శివాజీ గణేషన్ గారితో ఒక సినిమా చేయాలి. అదే సమయంలో శంకర్ ఇండియన్ కథను నాకు చెప్పారు. రెండు కాంతులు చాలా దగ్గర దగ్గరగా అనిపించాయి. అదే విషయాన్ని శివాజీ గణేషన్ తో చెప్పాను.  శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం' అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం." అంటూ చెప్పారు కమలహాసన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: