వైరల్ అవుతున్నజాన్వి కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జాన్వీ.. తాను ఫాలో అవుతున్న నమ్మకాల గురించి మాట్లాడింది. హిందూ మత విశ్వాసాలను ప్రస్తుతం తాను ఎంతలా ఫాలో అవుతున్నదీ ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.ఈ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవి గురించి జాన్వీ మాట్లాడింది. "ఆమె కొన్ని విషయాలను బాగా విశ్వసించేది. కొన్ని పనులను కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే చేయాలి.. శుక్రవారం హెయిర్ కట్ చేయించుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు.. శుక్రవారాలు బ్లాక్ డ్రెస్ వేసుకోద్దు.. అనేది. ఇలాంటి మూఢనమ్మకాలను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత నేను వాటిని నమ్మడం మొదలుపెట్టాను. నిజానికి మరింత ఎక్కువగా నమ్మాను. ఆమె ఉన్నప్పుడు నేను మత విశ్వాసాలను నేను ఇంతగా పట్టించుకున్నానా లేదా అన్నది నాకు తెలియదు. అమ్మ ఉన్నప్పుడు ఆమె వీటిని విశ్వసిస్తుందని మేమందరం కూడా చేసే వాళ్లం. కానీ ఆమె చనిపోయిన తర్వాత మన హిందూయిజం సంస్కృతి, చరిత్రతో మనకున్న సంబంధంతో మత విశ్వాసాలపై నా నమ్మకం మరింత పెరిగిపోయింది" అని జాన్వీ చెప్పడం విశేషం.జాన్వీ ఇప్పటికీ తరచుగా వస్తూ తిరుమల శ్రీవారిని దర్శించకుంటుందన్న విషయం తెలిసిందే. దీని గురించి కూడా ఆమె స్పందించింది. "ఆమె ఆ దేవుడి పేరును ఎప్పుడూ తలచుకుంటూ ఉండేది. నారాయణ నారాయణ నారాయణ అంటూ ఉండేది. తాను నటిస్తున్న రోజుల్లో ప్రతి ఏటా తన పుట్టిన రోజు నాడు ఆ గుడికి వెళ్లేది. పెళ్లి తర్వాత వెళ్లలేదు. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టిన రోజు నాడు ఆ గుడికి వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. తొలిసారి అలా చేసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. అదే సమయంలో మానసిక ప్రశాంతత కూడా లభించింది" అని జాన్వీ చెప్పింది.