అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా..!?

Anilkumar
టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ నాంది ఉగ్రం మారేడుమిల్లి ప్రజానీకం ఇలా వరుసగా సీరియస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు.  అయితే ఈయన నటించిన లేటెస్ట్ సినిమా ఆ ఒక్కటి అడక్కు. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్గా మంచి ఫామ్ లోకి వచ్చిన ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మల్లి అంకం  డైరెక్టర్గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. కాగా ఈ సినిమా మే 3న విడుదలై పాజిటివ్ టాక్ తో దోచుకుపోయింది. మ్యాట్రిమోనీల బారిన పడిన యువతను ఏలా మోసం చేస్తున్నారు ఆ సమస్యలను కళ్ళకు కట్టినట్లుగా కామెడీ జోనర్ లో చూపించాడు దర్శకుడు. కథ కథనం చాలా

 బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అంతంతగా నిలిచింది. అయితే ఈ సినిమాతో నరేష్ తన మార్క్ కామెడీ సీన్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే థియేటర్స్ లో బాగానే అలరించిన ఈ సినిమా తాజాగా ఇప్పుడు ఓటీటీ లోకి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తోపాటు ఆహా కూడా సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మే 31 నుంచి ఆ ఒక్కటి అడక్కు మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి

 తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే ఆ ఒక్కటి అడక్కు మూవీ రెండు ఓటీటీల్లో ఒకేసారి రిలీజవుతుందా? లేదా కొన్ని రోజుల గ్యాప్ తో స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆ ఒక్కటి అడక్కు లో వెన్నెల కిషోర్, జేమీ లీవర్, హర్ష చెముడు, సిమ్రాన్ చౌదరి, అరియానా గ్లోరీ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. చిలకా ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలకా ఈ ను నిర్మించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: