సత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీని విడుదల చేయనున్న ఆ రెండు క్రేజీ సంస్థలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలెంటెడ్ నటుడుగా పేరు తెచ్చుకున్న సత్య దేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట ఈ చిత్ర బృందం మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే అందుకు తగినట్లుగా ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మే 3 వ తేదీన కాకుండా మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు  మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసుకుంది.
 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేశారు. ఇది ఇలా ఉంటే గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి భైరవ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను రెండు క్రేజీ సంస్థలకు అమ్మివేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను దక్కించుకున్న ఈ రెండు సంస్థలు ఈ మూవీ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: