"బచ్చల మల్లి" మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అల్లరి నరేష్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. పరియ అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు మళ్ళీ అంకం దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ లో హీరో గా నటించిన అల్లరి నరేష్ వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన తన తదుపరి మూవీ లకు సంబంధించిన కొన్ని క్రేజీ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... ప్రస్తుతం నేను  సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "బచ్చల మల్లి" అనే మూవీ లో నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను ఫుల్ సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాను. ఆ సినిమాలో తనది మూర్ఖత్వానికి పేరుగాంచిన పాత్ర అని ... ఒక రకంగా ఆ ఛాలెంజింగ్ పాత్రలో ఆడియన్స్ ని అలరించేలా నటిస్తున్నట్లు నరేష్ చెప్పారు.

బచ్చల మల్లి సినిమా 90 వ దశకం నేపథ్యంలో సాగనున్న కథతో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే నరేష్ ఇదే ఇంటర్వ్యూ లో "బచ్చల మల్లి" మూవీ తర్వాత మరొక రెండు ప్రాజక్ట్స్ లైన్ లు లైన్ లో ఉన్నట్లు , త్వరలోనే వాటి పూర్తి డిటైల్స్ కూడా వెల్లడి కానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అవి రెండు కూడా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగుతాయని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అల్లరి నరేష్ తన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి సుడిగాడు మూవీ కి కూడా సీక్వెల్ చేయనున్నట్లు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

an

సంబంధిత వార్తలు: