పెళ్ళి చేసుకుంటా కానీ.. పిల్లలు కనడంపై ట్విస్ట్ ఇచ్చిన మృణాల్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంత పాపులారిటీ ఉంటుంది కాబట్టి.. సినిమా హీరో హీరోయిన్లు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక సినీ సెలబ్రిటీలను ఎప్పుడూ కెమెరాలు ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. అందుకే వారికి సంబంధించిన ఏ విషయం ఇంటర్నెట్ లోకి వచ్చిన దానిని తెలుసుకునేందుకు ఇంటర్నెట్ జనాలు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా సినీ సెలబ్రిటీలు నేరుగా అభిమానులతో మాట్లాడగలుగుతున్నారు. అదే సమయంలో ఏ విషయాన్ని దాచుకోకుండా ఇక తమ మనసులో ఉన్న అన్నింటిని కూడా బయట పెట్టేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు కొంతమంది సినీ సెలెబ్రిటీలు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్న మృనాల్ ఠాగూర్ పిల్లలు కనడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

 ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ ఠాగూర్ కి పెళ్లి పిల్లలు కనడం పై ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే బిడ్డను కనే ఆలోచన మాత్రం లేదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఫ్రీజింగ్ ఎగ్స్ విధానానికి సుముఖంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాను అంటూ తెలిపింది. కాగా అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు తమ అండాన్ని వయసులో ఉన్నప్పుడే భద్రపరుచుకుని ఆ తర్వాత ఐవిఎస్ ద్వారా పిల్లలను కంటూ ఉంటారు. దీనినే ఫ్రీజింగ్ ఎగ్ పద్ధతి అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: