ఆ విషయంలో కోపంతో ఊగిపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ లో కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.ఆమె చేసిన 'శబరి' మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఆ మూవీ ప్రొమోషన్స్లో భాగంగా ఆమె కొంతమంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు.కొంతమంది రివ్యూల వల్లే తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని రివ్యూల పైనే మొత్తం తప్పు వేసేస్తూ ఉంటారు.సినిమా బాగున్నప్పుడు ఇలాంటి తప్పులు రివ్యూల పైన వేయడం కరెక్టే కానీ సినిమా లు బాగా లేకపోయినా రివ్యూలదే తప్పు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఇది రోజు నడుస్తున్న చర్చే. ఈ క్రమం లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ సైతం రివ్యూల పై మండిపడింది.ప్రస్తుత టెక్నాలజీ యుగం లో రివ్యూలను ఆపినా పెద్దగా బెనిఫిట్ ఉండదని సోషల్ మీడియా ద్వారా సులు వుగానే టాక్ స్ప్రెడ్ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ నేను అసలు సినిమాలకు మొదటి రోజు వచ్చే రివ్యూలు చదవను. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వాటి గురించి మాట్లాడినా నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఈ రివ్యూలు రాసే వారికీ ఏం అర్హత ఉందని ఇలా సినిమాల గురించి రివ్యూలు రాసుకొస్తున్నారు. బాగున్నా సినిమా కి కూడా తమ వ్యూలు కోసం నెగటివ్ రివ్యూలు రాసి ఆ సినిమాలను కాస్త నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కొంతమంది రివ్యూల వల్లే తమ సినిమా లు ఫ్లాప్ అయ్యాయి అని రివ్యూల పైనే మొత్తం తప్పు వేసేస్తూ ఉంటారు.ఇక 'శబరి' సినిమా విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు మే 3న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: