ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికి చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఇక ఈమె చేసే సినిమాల్లో ఈమె పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ నిజ జీవితంలో కూడా అంతే బోల్డ్ గా ఓపెన్ గా ఉంటుంది. తనకి ఏం అనిపిస్తే ఖచ్చితంగా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేస్తూ ఉంటుంది. దీంతోనే ఆమె చాలా సార్లు ట్రోల్స్ కి గురైంది. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ అటువంటి ట్రోల్స్ పై ఘాటుగా స్పందించింది.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన పలు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమ సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అవుతూ ఒకప్పుడు ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంట్రాక్షన్ ఉండేది.. థియేటర్స్ లో కలిసినప్పుడు సినిమాపై వాళ్ళ ఒపీనియన్ నేరుగా చెప్పే వాళ్ళు అంతేకాదు.. దర్శకుడు అడిగినప్పుడు కూడా ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడేవారు కాదు.. చాలా బాగుంది అని అనేవారు సినిమా చూస్తూ గట్టిగా కేకలు వేసేవారు.. దీంతో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అని నేను అనుకునే వాళ్ళం..

 కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అభిప్రాయాలను పిచ్చిపిచ్చిగా సోషల్ మీడియాలో పెడుతున్నారు.. ఇక్కడ విషయం ఏంటంటే.. పాజిటివ్ గా పెడితే వ్యూస్ రావట్లేదు అని నెగటివ్గా అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని వెల్లడించింది వరలక్ష్మి శరత్ కుమార్.. అంతేకాదు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది.. నెగిటివ్గా మాట్లాడాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు.. బాగాలేదు అని.. వేస్ట్ అని.. అందరూ అంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్..  కానీ చాలా మంది నీచంగా కామెంట్‌ చేస్తూ నేను నిజాయితీగా చెప్పానని అంటుంటారు. కానీ అది హానెస్టీ కాదు, మీ అమ్మ గురించో, మీ అక్క గురించో అలా మాట్లాడితే చెప్పుతో కొడతారు. కాబట్టి ఇలాంటి బేస్‌లెస్‌, ఐడెంటిటీ లేని వాళ్లు కామెంట్‌ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: