ఆ కారణంగా నాగ చైతన్య మూవీ నుండి తప్పుకున్న మహానటి...!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహానటి గా గుర్తింపు పొందిన నటి కీర్తి సురేష్. ఒకప్పుడు హోమ్లీ గా సినిమాలు మాత్రమే చేసే కీర్తి ప్రస్తుతం బోల్డ్ సీన్స్ కు కూడా ఒకే చెప్పడం ఆశ్చర్యం వేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.అలాంటి అందాల ముద్దుగుమ్మ మహానటి గా పాపులారిటి సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందా..?అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెసెంట్ టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ సినిమా లతో బిజీ గా ముందుకు వెళుతుంది . మరి ముఖ్యంగా తెలుగు లో భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అమ్మడి కెరియర్ మొత్తం కొలప్స్ అయిపోతుందని ఎంత అనుకున్నారు .కానీ కీర్తి సురేష్ ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ సినిమాల కు ఓకే చేసింది. అక్కడ బోల్డ్ పాత్ర లో కనిపించడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం జరిగింది. తాజాగా టాలీవుడ్ లో ఆమె నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమా లో నటించడానికి ఓకే చెప్పింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సడన్గా ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేష్ తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .ఆమెకున్న బిజీ షెడ్యూల్స్ కారణం గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందా..? లేక హీరోయిన్ సాయి పల్లవి కావడంతో తన క్యారెక్టర్ కి పెద్దగా డిమాండ్ ఉండదు అని ఆలోచించే సినిమా నుంచి బయటకు వచ్చేసిందా..? తెలియాల్సి ఉంది. మొత్తానికి కీర్తి సురేష్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీ లో మారు మ్రోగియేలా చేస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో..? ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: