"ఓటిటి" లో సూపర్ సక్సెస్ అయిన "చారి 111"..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన కమీడియన్ లలో ఒకరు అయినటు వంటి వెన్నెల కిశోర్‌ తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిం దే.  సంయుక్తా విశ్వనాథన్‌ , మురళీ శర్మ , సత్య తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు . అదితి సోనీ నిర్మించిన ఈ మూవీ కి ... టీ జీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. సైమన్ కె కింగ్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 1, 2024 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.
 

పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇలా ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను అలరించడం లో సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు ఈ సినిమా ఇప్పటి వరకు 60 మిలియన్ ప్లస్ మినట్స్ ను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా "చారి 111" మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో దుమ్ము లేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk

సంబంధిత వార్తలు: