ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ కొత్త లుక్ లో మెరిసిపోయిన సమంత..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. తన అందం అభినయంతో ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన ఆడి పాడింది ఈ బ్యూటీ. చివరిగా ఖుషీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. అయితే గత ఇలా ఉంటే సమంతా మయూసైటర్ వ్యాధితో బాధపడుతూ సినిమాల కి కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆ కారణంగా సమంత సినిమాకు పూర్తిగా దూరమై ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటుంది. దీనితో సమంత నెక్స్ట్ చేస్తున్న సినిమాలేంటి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇటీవల కాలంలో సమంతా కొత్త కొత్త ప్రదేశాలను సందర్శిస్తోంది. యోగ పూజలు వంటివి బాగానే చేస్తూ తన ఆరోగ్యం కుదుటపడడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మెడికల్ యోగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇలా అన్ని రకాల పనులను చేస్తూ తన ఆరోగ్యం బాగుండాలి అని ప్రయత్నిస్తోంది . ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ లో నటించాల్సి ఉంది. తెలుగులో ఎటువంటి సినిమాలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  

సమంత వ్యాధి నుండి త్వరగా కోలుకొని మళ్ళీ చురుకుగా సినిమాలు చేయాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో 34 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాధించుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. స్యామ్ చేసే ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా స్టన్నింగ్ లుక్‌లో సమంత బ్లాక్ లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. బ్రా లేకుండా కేవలం బ్లాజర్ తో డిఫరెంట్‌ స్టిల్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇట్స్ స్టైల్ బేబీ అనే ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఇది క్షణంలో వైరల్ అవ్వడంతో అభిమానులు కాదు.. స్టార్ హీరోయిన్స్ తమన్నా, రోహిణి శర్మ లాంటి వారు కూడా దీనిపై స్పందించారు. తమన్న, రోహిణి శర్మ ఇద్దరూ ఫైర్ ఇమోజీలతో సమంత ఫొటోస్ పై తమ రియాక్షన్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: